Telangana History in Telugu | Kakatiya Dynasty Inscriptions |కాకతీయుల సామ్రాజ్యం - శాసనాలు | Gk in Telugu

Telangana History in Telugu | Kakatiya Dynasty Inscriptions |కాకతీయుల సామ్రాజ్యం - శాసనాలు

 కాకతీయుల సామ్రాజ్యం - శాసనాలు 
Telangana History in Telugu | History in Telugu | Gk in Telugu | General Knowledge in Telugu 

     Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

➺ మాగల్లు శాసనం :

మాగల్లు శాసనాన్ని తూర్పు చాళుక్య రాజు క్రీ.శ 956 సంవత్సరంలో లిఖించాడు. ఈ శాసనంలో కాకత్యగుండ్యన యజమాని అయినటువంటి దానార్జవుడు అయిన ఒక బ్రాహ్మణునికి మాగల్లు గ్రామాన్ని దానం చేసిన విషయంను ప్రస్తావించడం జరిగింది. 

➺ హనుమకొండ శాసనం :

హనుమకొండ శాసనాన్ని క్రీ.శ.1063 సంవత్సరంలో రుద్రదేవుని మంత్రి అయినటువంటి అచితేంద్రుడు చెక్కించాడు. ఈ హనుమకొండ శాసనంలో 1063 సంవత్సరంలో రుద్రదేవుడు సొంతంగా స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న విషయాన్ని తెలియజేస్తుంది. 

➺ ద్రాక్షారామం శాసనం :

ఈ శాసనాన్ని రెండవ ప్రోలరాజు మంత్రి క్రీ.శే.1158లో లిఖించాడు. ఈ శాసనంలో రెండో ప్రోలరాజు తర్వాత అతని కుమారుడు రుద్రదేవుడు రాజ్యానికి వచ్చిన విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. 

➺ బయ్యారం శాసనం :

బయ్యారం శాసనాన్ని గణపతిదేవుని సోదరి అయిన కాకతి మైలాంబ క్రీ.శ.1219లో చెక్కించింది. ఈ శాసనంలో రాష్ట్రకుటులకు సామంతులని, కాకతీపురంను పరిపాలించడం వల్ల కాకతీయులు అని పేరు వచ్చిందని తెలిపింది. 

➺ మోటుపల్లి అభయ శాసనం :

ఈ శాసనాన్ని గణపతి దేవుడు క్రీ.శ.1244 సంవత్సరంలో లిఖించాడు. ఈ మోటుపల్లి శాసనంలో విదేశీ వర్తకులకు విధించే సుంకాల వివరాలు, వ్యాపారులకు కల్పించే రక్షణ గురించి వివరించారు. 



Also Read :


➺ చందుపట్ల శాసనం :

చందుపట్ల శాసనాన్ని రుద్రమదేవి బంటుగా పనిచేసిన పువ్వుల ముమ్మడి క్రీ.శ. 1289 సంవత్సరంలో లిఖించింది. ఈ చందుపట్ల శాసనంలో రాణి రుద్రమదేవి అంబదేవుని తిరుగుబాటును అణచివేసే ప్రయత్నంలో వీరమరణం పొందిందని తెలియజేస్తుంది. 

➺ త్రిపురాంతక శాసనం :

ఈ శాసనాన్నిఇ క్రీ.శ.1291 సంవత్సరంలో అంబదేవుడు వేయించాడు. ఈ త్రిపురాంతక శాసనంలో అంబదేవుని రాజు యొక్క విజయాలను పొందుపరచడం జరిగింది. 

➺ సలకవీడు శాసనం :

దీనిని రెండో ప్రతాపరుద్రుడు క్రీ.శే.1317లో లిఖించారు. ఈ సలకవీడు శాసనంలో పాండ్యుల మీద విజయానికి సూచికగా రాజుగారి ఆదేశం ప్రకారం దేవేరి నాయకుడు ఏరువ భూమిలోని సలకవీడు గ్రామాన్ని కావేరి శ్రీ రంగనాథ స్వామికి దానం చేసిన విషయాలు తెలియజేస్తుంది. 

➺ మల్కాపురం శాసనం :

ఈ శాసనం విశ్వేశ్వర శివచార్యుని పుణ్యకార్యాల గురించి మరియు కాకతీయుల కాలంనాటి నాట్య రీతుల గురించి తెలియజేస్తుంది. దీనిని క్రీ.శ.1261లో రుద్రమదేవి వేయించింది. 

➺ కొలనుపల్లి శాసనం :

ఈ శాసనంలో చెన్నకేశవస్వామికి, నరసింహస్వామి ఆలయానికి దానాలు చేసినట్లు తెలియజేస్తుంది. 


Related Posts : 



Also Read :



Post a Comment

0 Comments