Telangana History in Telugu | Recherla Padmanayakulu Period Poets of Telangana

Telangana History in Telugu

Telangana Poets During Recherla Padmanayakulu Rule  | Telangana History in Telugu

రేచర్ల పద్మనాయకుల కాలంలోని ప్రముఖ కవులు, పండితులు

తెలంగాణ చరిత్రలో రేచర్ల పద్మనాయకుల కాలం ఒక విశిష్ట సాంస్కృతిక యుగంగా నిలిచింది. ఈ కాలంలో అనేకమంది మహానుభావులైన కవులు, పండితులు, తత్వవేత్తలు వెలుగొందారు. వీరి రచనలు తెలుగు సాహిత్యం, సంస్కృతి, తత్వశాస్త్రం, సంగీతం వంటి రంగాలను విస్తృతం చేశాయి.

విద్యారణ్య స్వామి :

విద్యారణ్య స్వామి శృంగేరి పీఠానికి చెందిన 21వ పీఠాధిపతి. ఈయన సంగీతసారం అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు. మహామేధావి, కవి, తాత్వికుడు అయిన విద్యారణ్య స్వామి, హరిహరరాయలు మరియు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రేరణ ఇచ్చారు.కాశీ లక్ష్మణ శాస్త్రి రచించిన గురువంశ కావ్యం ప్రకారం విద్యారణ్యుడు ఏకశిలానగరవాసి (ఓరుగల్లు – వరంగల్) అని పేర్కొనబడింది.

సాయనుడు : 

సాయనుడు భారతీయ విద్యా సంప్రదాయంలో అత్యంత ప్రసిద్ధ పండితుడు. ఈయన చతుర్వేదాలకు భాష్యాలు రచించారు.

ప్రధాన రచనలు:

  • పురుషార్థ సుధానిధి
  • ఆయుర్వేద సుధానిధి
  • యజ్ఞతంత్ర సుధానిధి

వేదాల అర్థాన్ని సామాన్యులకు చేరువ చేసిన మహాపండితుడు సాయనుడు.

పద్మనాయక భూపాలుడు : 

పద్మనాయక భూపాలుడు సారంగధర చరిత్ర అనే కావ్యాన్ని రచించాడు. ఈయనకు “సర్వజ్ఞ” అనే బిరుదు ఉంది. సాహిత్యం, తత్వం, నైతిక విలువలపై లోతైన అవగాహన కలిగిన రాజకవి.

విశ్వేశ్వరుడు :

విశ్వేశ్వరుడు రచించిన ముఖ్య గ్రంథాలు:

  • చమత్కార చంద్రిక
  • వీరభద్ర విజృంభణ

అలంకార శాస్త్రం, వీర రస వర్ణనల్లో విశేష ప్రతిభ కనబరిచాడు.

కవిభల్లటుడు :

కవిభల్లటుడు బహుముఖ ప్రతిభాశాలి కవి.

ప్రసిద్ధ రచనలు:

  • గుణమంజరి
  • పదమంజరి
  • శూద్రక రాజచరిత్రం
  • బేతాళ పంచవింశతి

కథా కావ్యాల ద్వారా ప్రజాదరణ పొందిన కవి.

మడికి సింగన :

ముఖ్య గ్రంథాలు:

  •  సకలనీతి సమ్మతం
  • పద్మపురాణోత్తర ఖండం
  • భాగవత స్కంధం
  • జ్ఞాన వాశిష్ట రామాయణం

సర్వజ్ఞ సింగభూపాలుడు :

సర్వజ్ఞ సింగభూపాలుడు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. కవి, నాటకకారుడు, సంగీత నాట్య మర్మజ్ఞుడు.

ప్రధాన రచనలు : 

  • రసావర్ణ సుధాకరం (అలంకార శాస్త్ర గ్రంథం)
  • సంగీత సుధాకరం
  • కందర్ప సంభవం
  • కువలయావళి

సారంగదేవుడు రచించిన సంగీత రత్నాకరం గ్రంథానికి సంగీత సుధాకరం పేరుతో వ్యాఖ్యానం చేశాడు. అనేక మంది కవులను పోషించిన మహారాజు.

గౌరన :

ముఖ్య రచనలు:

  • నవనాథ చరిత్ర
  • లక్ష్మణ దీపిక
  • హరిశ్చంద్రోపాఖ్యానం

ఈయనకు “సరస సాహిత్య లక్ష్మణ చక్రవర్తి”“ప్రతివాద మదగజ వంచాననుడు” అనే బిరుదులు ఉన్నాయి.మార్కండేయ, స్కంధ పురాణాల్లోని హరిశ్చంద్ర మహారాజు కథ ఆధారంగా హరిశ్చంద్రోపాఖ్యానం రచించాడు.

బమ్మెర పోతన : 

బమ్మెర పోతన తెలుగు సాహిత్యంలో భక్తి కవిగా చిరస్థాయిగా నిలిచాడు.

ప్రసిద్ధ రచనలు:

  • వీరభద్ర విజయం
  • భోగినీ దండకం
  • ఆంధ్ర మహాభాగవతం (తెలుగులో)

పోతన కొంతకాలం మూడవ సింగభూపాలుని ఆస్థానంలో ఉన్నారు. పోతన జన్మస్థలం బమ్మెర (నేటి వరంగల్ జిల్లా)పోతన భాగవతం తెలుగులో భక్తికి మారుపేరుగా నిలిచింది. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, వామనావతారం, శ్రీకృష్ణ లీలలు అద్భుతంగా వర్ణించాడు.

కొరవి గోపరాజు :

కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక ఒక ప్రసిద్ధ కథాకావ్యం.ఈ గ్రంథానికి మూలం విక్రమార్క చరిత్ర (సంస్కృత కావ్యం). పాల్కురికి సోమనాథుని తర్వాత తెలంగాణ సాంఘిక జీవితాన్ని విస్తృతంగా వర్ణించిన కావ్యం ఇదే.

Post a Comment

0 Comments