Lok Adalat : Indian Polity
లోక్ అదాలత్ (ప్రజల న్యాయస్థానం)
వివిధ కారణాల వల్ల న్యాయస్థానాల్లో కేసులు పరిష్కరించడంలో చాలాకాలం పడుతుంది. కేసుల పరిష్కారం ఎక్కువ రోజులు పడుతుండడంతో కేసులు త్వరితగతిన పరిష్కరించే ప్రత్యాన్మాయంగా లోక్ అదాలత్లు ఏర్పాటు చేశారు. ఈ లోక్ అదాలత్ పద్దతిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.ఎన్.భవతి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. మొదటిసారిగా గుజరాత్లో 1982లో లోక్ అదాలత్లను ప్రారంభించారు. సులభంగా పరిష్కరించగలిగే కొన్ని రకాల కేసులను పెద్దమనుషుల మధ్యవర్తిత్వంలో పరిష్కరించడానికి చట్టబద్ధమైన ప్రతిపత్తి కల్గిస్తూ ‘‘లోక్ అదాలత్’’ అనే ప్రజా న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు.
0 Comments