డా॥ ఏ.పి.జే అబ్దుల్ కలాం స్కాలర్షిప్ ప్రోగ్రామ్
భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం గౌరవార్థం అబ్దుల్ కలాం స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరుగుతుంది.
ప్రతిభ కల్గిన నిరుపేద మెడికల్/ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల కోసం డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించడం జరుగుతుంది. ఇట్టి స్కాలర్షిప్ ముఖ్య ఉద్దేశ్యం అవసరమైన విద్యార్థులకు సహాయం చేయడం మరియు ఉన్నత విద్యలో వారి వృత్తిపరమైన కోర్సును పూర్తి చేయడానికి వీలు కల్పించడం. ఇట్టి స్కాలర్షిప్ ప్రభుత్వ/ప్రైవేటు విద్యాసంస్థలలో ఇంజనీరింగ్/మెడికల్ ప్రవేశాలు పొందిన వారికి కేటాయించబడినది.
డా॥ ఏ.పి.జే అబ్దుల్ కలాం స్కాలర్షిప్ ప్రోగ్రామ్కు ఆన్లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు,వివరాలు కింద తెలియజేయడం జరిగింది.
డా॥అబ్దుల్ కలాం స్కాలర్షిప్ రివ్యూ |
|
చివరితేది |
31 మే 2021
|
తరగతి/కోర్సు |
12వ తరగతి పూర్తి చేయాలి
|
స్కాలర్షిప్ రకం |
ప్రతిభ ఆధారంగా
|
అవార్డు మొత్తం |
20,000
|
జెండర్ |
అందరూ
|
రిలిజియన్ |
అందరూ
|
దేశం |
భారతదేశం
|
ఆన్లైన్ ధరఖాస్తు |
|
జాతీయ / రాష్ట్రీయ మెడికల్/ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్టు వ్రాసేవారు.
ఖచ్చితంగా భారత విద్యార్థులు అయి ఉండాలి
12వ తరగతిలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.(2021 లో బోర్డు పరీక్షకు హజరయ్యే విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారి ఫలితాల షీట్ను సమర్పించాల్సి ఉంటుంది)
కుటుంబ సంవత్సర ఆదాయం 3 లక్షలకు మించరాదు.
డా॥ ఏజిపే అబ్దుల్ కలాం స్కాలర్షిప్ ప్రోగ్రామ్కు ధరఖాస్తు చేసుకున్న విద్యార్థులను వారి ప్రతిభ, ఇంటర్యూ ఆధారంగా ఎంపిక చేసి స్కాలర్షిప్ రూపాయలు అందించడం జరుగుతుంది.
- ఆర్థిక అవసరం మరియు విద్యా నేపథ్యం ఆధారంగా స్కాలర్షిప్ ధరఖాస్తు పరిశీలన జరుగుతుంది.
- అభ్యర్థులను టెలిఫోన్ ఇంటర్యూు ద్వారా షార్ట్లిస్టు చేయడం జరుగుతుంది.
- తుది ఎంపిక కొరకు ముఖాముఖి ఇంటర్యూ(అవసరమైతే) చేయడం జరుగుతుంది.
స్కాలర్షిప్ మొత్తం :
1) 20,000 రూపాయలు
కావాల్సిన ధృవీకరణ పత్రాలు :
1) పాస్పోర్టు సైజు ఫోటో
2) మార్కుల మెమో
3) గుర్తింపు ధృవపత్రం ( ఆధార్ కార్డు)
4) ప్రస్తుత సంవత్సరం చదువుతున్న అడ్మిషన్ గుర్తింపు కార్డు ( అడ్మిషన్ లెటర్/ ఐడి కార్డు/ బోనఫైడ్ సర్టిఫికేట్)
5) ప్రస్తుత సంవత్సరం చదువుతున్న ఫీజు రశీదు
6) అభ్యర్థి బ్యాంక్ ఖాతా బుక్ / క్యాన్సల్ చెక్
7) ఆదాయం సర్టిఫికేట్ / అఫిడవిట్
ఎలా ధరఖాస్తు చేసుకోవాలి :
1) తమ రిజిస్ట్రేషన్ ఐడితో బడ్డీ4స్టడీ లోకి లాగిన్ అవ్వాలి, (ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ ఐడి లేకపోతే రిజిస్ట్రేషన్ బటన్ నొక్కి ఈమేయిల్/మోబైల్/ఫేస్బుక్/జిమేయిట్ అకౌంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.)
2) లాగిన్ అయిన తర్వాత మీరు డా॥ ఏజిపే అబ్దుల్ కలాం స్కాలర్షిప్ అప్టికేషన్కు రిడైరెక్ట్ అవుతారు.
3) తర్వాత స్టార్ట్ అప్లికేషన్ బటన్పై క్లిక్ చేయాలి. (స్టార్ట్ అప్లికేషన్ నొక్కే ముందు స్కాలర్షిక్కు సంబందించిన వివరాలు పూర్తిగా చదువుకోవాలి)
4) ఆన్లైన్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫారంలో అడిగిన సమాచారంను పూర్తి చేయాలి
5) కావాల్సిన ధృవీకరణ పత్రాలను అఫ్లోడ్ చేయాలి
6) నియమనిబంధనలను అంగీకరించిన తర్వాత ప్రివ్యూ బటన్పై క్లిక్ చేయాలి
7) ప్రివ్యూలో మీరు నింపిన వివరాలు మరోకసారి సరిచూసుకొని చివరగా సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత మీ ధరఖాస్తు పూర్తి అవడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు :
- చివరితేది. 31-05-2021
పూర్తి సమాచారం కోరకు :
ఈ స్కాలర్షిప్ పథకానికి అర్హత ఉన్న విద్యార్థులు తమ ధరఖాస్తును చివరితేదికి ముందే సమర్పించాలి.
0 Comments