నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్
నేషనల్
టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్టిఎస్ఈ) మొదటి దశ పరీక్ష
తేది.15-01-2022 రోజున జరగబోతుంది. ఈ టెస్టుకు తెలంగాణలో మాత్రం ఫీజు
చెల్లింపునకు డిసెంబర్ 2 వరకు గడువు పెంచారు. ప్రధానంగా ఈ టెస్టులో విజయం సాధించి
స్కాలర్షిప్ పొందితే కొన్ని నిబంధనలకు లోబడి డాక్టరేట్ పూర్తయ్యేంత వరకు
కొనసాగుతుంది. నిజానికి 10 వ తరగతి చదువుతున్న పిల్లలకు ఇదో మంచి అవకాశం.
దేశంలో నాణ్యమైన పాఠశాల విద్యను అందించేందుకు అవసరమైన ప్రణాళికలను
రూపొందించే ఉద్దేశ్యంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యూకేషన్ రిసెర్చ్
అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ను ఏర్పాటు చేసినారు. ఈ సంస్థ పాఠశాల
విద్య మెరుగు కోసం ఎన్నో చర్యలు చేపట్టింది. అలాంటి వాటిలో ఒకటి నేషనల్
టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్టిఎస్ఈ). మొదట్లో దీన్ని నేషనల్
సైన్స్ టాలెంట్ సెర్చ్ స్కీమ్గా పిలిచేవారు. అందులో కేవలం సైన్స్
సంబంధ అంశాల నుంచి మాత్రమే ఇచ్చేవారు. అయితే 1976 లో ఈ పరీక్షను
ఎన్టీఎస్ఈ గా మార్చారు. అదే సమయంలో సైన్స్తో పాటు అన్ని అంశాల్లో
నైపుణ్యాన్ని పరీక్షించేలా పరీక్షా విధానంలో కూడా మార్పులు చేసినారు.
➠ అర్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు
ఈ టెస్టు రాసేందుకు అర్హులు. కేంద్రీయ విద్యాలయ, నవోదయ, సీబిఎస్ఈ,
న్యూఢల్లీిలోని ఐసీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లోని విద్యార్థులు కూడా అర్హులే.
➠ ఎంపిక విధానం :
వ్రాత పరీక్షా ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇది రెండు దశంలో ఉంటుంది.
1) స్టేజ్ - 1
ఈ పరీక్షను విద్యార్థి చదువుతున్న పాఠశాల ఉన్న రాష్ట్రం / కేంద్ర పాలిత
ప్రాంతం నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
అవి. 1) మెంటల్ ఎబిలిటీ టెస్టు ( మ్యాట్), 2) స్కాలస్టిక్ అప్టిట్యూడ్ టెస్టు (సాట్)
ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. రాష్ట్రంలో పరీక్షను
ఇంగ్లీష్/హిందీ/ తెలుగు/ఉర్దూ మాద్యంలో రాయవచ్చు. మెంటల్ ఎబిలిటీ విభాగం
నుండి 100 ప్రశ్నలు ఇస్తారు. వీటికి కేటాయించిన మార్కులు 100 ఉంటాయి.
స్కాలస్టిక్ అప్టిట్యూడ్ టెస్టులో కూడా 100 ప్రశ్నలకు 100 మార్కులు
ఉంటాయి. ప్రతి పేపర్కు 120 నిమిషాలు (రెండు గంటలు) ఉంటాయి. రెండు పరీక్షలు
కూడా ఒకే రోజు ఉదయం, మధ్యాహ్నం సెషన్లుగా నిర్వహిస్తారు. ఎటువంటి
నెగిటివ్ మార్కులు లేవు. కాకపోతే రెండు పేపర్లలో నిర్ధేశించిన విధంగా కనీస
అర్హత మార్కులను సాధించాలి. ఈ క్రమంలో ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు 32 శాతం,
మిగతా వారు 40 శాతం మార్కులను ప్రతి పేపర్లో సాధించాలి. వీరిని మాత్రమే
మెరిట్ లిస్టు ప్రిపరేషన్లో పరిగణలోకి తీసుకుంటారు. మ్యాట్, సాట్లలో
సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా తర్వాతి దశకు ఎంపిక చేస్తారు.
2) స్టేజ్ -2 :
స్టేజ్ -1 లో ఎంపికైన విద్యార్థులు ఈ పరీక్ష వ్రాయడానికి అర్హత
పొందుతారు. ఇది జాతీయ స్థాయిలో జరుగుతుంది. పరీక్షలో రెండు విభాగాలు
ఉంటాయి.
అవి 1) మెంటల్ ఎబిలిటీ టెస్టు ( మ్యాట్), 2) స్కాలస్టిక్ అప్టిట్యూడ్ టెస్టు (సాట్)
ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. రాష్ట్రంలో పరీక్షను
ఇంగ్లీష్/హిందీ/ తెలుగు/ఉర్దూ మాద్యంలో రాయవచ్చు. ప్రశ్నల స్థాయి
పెరుగుతుంది. ప్రశ్నపత్రాన్ని ఎస్సీఈఆర్టి రూపొందిస్తుంది. మైనస్
మార్కులు ఉండవు. ప్రశ్నపత్రం అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మ్యాట్,
సాట్లలో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా స్కాలర్షిప్నకు అర్హులను ఎంపిక
చేస్తారు. ఈ దశ పరీక్షకు విద్యార్థులను అర్హులను చేసేందుకు ప్రతి రాష్ట్రం
/ కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక కోటా ఉంటుంది. ఈ పరీక్ష పూర్తి అయిన
తర్వాత స్కాలర్షిప్ ఎంపికకు మాత్రం ఎలాంటి కోటా ఉండదు.
➠ సిలబస్ :
మెంటల్ ఎబిలిటీ టెస్టు(మ్యాట్)లో విద్యార్థుల రిజనింగ్ సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ఎనాలజీస్, క్లాసిఫికేషన్, సిరీస్, కోడీంగ్
- డికోడీంగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంశాల నుండి ప్రశ్నలు ఇస్తారు.
స్కాలస్టిక్ అప్టిట్యూడ్ టెస్టు(సాట్) విభాగంలో పదో తరగతి సిలబస్ నుండి
ప్రశ్నలు వస్తాయి.
➠ స్కాలర్షిప్ :
ఈ పరీక్ష ద్వారా 1000 మంది ప్రతిభావంతులకు స్కాలర్షిప్లు
అందజేస్తారు. ఎంపికైన వారికి
➫ ఇంటర్మిడియట్ రెండెళ్లలో నెలకు రూ॥1,250 అందజేస్తారు.
➫ అండర్ గ్రాడ్యూవేషన్, పోస్టు గ్రాడ్యువేషన్లో ఉన్నప్పుడు నెలకు 2000 రూపాయలు ఇస్తారు.
➫ పీహెచ్డీలో చేరితే యూజిసి నిబంధనలకు అనుగుణంగా ఉపకారవేతనం మొత్తం నిర్ధారిస్తారు.
➫ Last Date : 02-12-2021
➠ పూర్తి వివరాల కొరకు :
➠ ఆన్లైన్ ధరఖాస్తు కొరకు
0 Comments