
రాజా రాంమోహన్రాయ్ Raja Ram Mohan Roy Biography in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
రాజా రాంమోహన్రాయ్ బెంగాల్లో 1772 సంవత్సరంలో జన్మించాడు. రామ్మోహన్రాయ్ సంస్కృతం పర్షియన్, ఇంగ్లీషు భాషలలో పండితునిగా ఉండేవాడు. అతనికి అరబిక్, లాటిన్, గ్రీకు భాషలు కూడా తెలుసు. రామ్మోహన్ రాయ్ హిందూ, ఇస్లాం, క్రైస్తవ, సూఫి వంటి అనేక మత సిద్దాంతాలను చదివారు. అనేక పుస్తకాలు చదవటం వల్ల అతడికి దేవుడు ఒక్కడే అన్న నమ్మకం కల్గింది. విగ్రహారాధన, బలులు ఇవ్వడం సరికాదని నమ్మేవాడు. అన్ని ప్రముఖ మతాలు ఒకే నమ్మకాలు కల్గి ఉన్నాయని, ఇతరుల మతాలను విమర్శించడం సరికాదని విశ్వసించేవాడు. హేతుబద్దంగా ఉన్నప్పుడు ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మాత్రమే మత భావనలను అంగీకరించాలని భావించేవాడు. పూజారుల అధికారాన్ని తిరస్కరించి తమ మతంలోని మూల గ్రంథాలను చదవమని ప్రజలను అతడు కోరాడు. మహిళలు విద్యావంతులు కావాలని, వాళ్లకు ఆస్తిలో హక్క కల్పించాలని కూడా ఆయన ఆనాడే వాదించారు. ముద్రణలోని కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుని అధిక సంఖ్యలో ప్రజలకు చేరటానికి అతడు తన భావాలను పత్రికల్లో, పుస్తకాలుగా ప్రచురించాడు.
1828 సంవత్సరంలో రామ్మోహన్ రాయ్ బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు. దేవుడు ఒక్కడే అన్న సిద్దాంతంతో విశ్వజనీన మతంలో నమ్మకమున్న వాళ్లందరితో కలిసి దీనిని ఏర్పాటు చేశాడు. 1833లో రామ్మోహన్రాయ్ మరణించిన తర్వాత ఈ ఉద్యమానికి దేవేంద్రనాథ్ టాగూర్, కేశవ చంద్రసేన్ నాయకత్వం వహించారు. వీళ్లు దేశమంతటా తిరుగుతూ, ఉపన్యాసాలు ఇస్తూ తమ భావాలను ప్రచారం చేశారు.
0 Comments