
ఏసియాన్ (ASEAN)
(Association of South East Asian Nations)
ఏసియాన్ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్) అనేది పది ఆగ్నేయాసియా దేశాలతో కూడిన ఒక ప్రాంతీయ అంతర్ ప్రభుత్వ సంస్థ. ఏసియాన్ మొత్తం 10 సభ్యదేశాలుగా ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఉంది.
సభ్యదేశాలు-
- బ్రూనై
- కంబోడియా
- ఇండోనేషియా
- లావోస్
- మలేషియా
- మయన్మార్
- ఫిలిప్పీన్స్
- సింగపూర్
- థాయిలాండ్
- వియత్నాం
- ఏసియాన్ డిక్లరేషన్ (బ్యాంకాక్ డిక్లరేషన్) సంతకంతో ఆగష్టు 8, 1967న స్థాపించబడినది. అప్పుడు స్థాపక సభ్యులుగా ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్ మరియు థాయిలాండ్ దేశాలున్నాయి.
- ఏసియాన్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి మరియు సాంస్కృతిక అభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రాంతీయ శాంతి మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహించడం మరియు సభ్య దేశాలకు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై పరస్పరం మరియు సహకరించడానికి అవకాశాలను అందించడం. ఏసియాన్ ఏకాభిప్రాయం-ఆధారిత నిర్ణయం తీసుకునే ప్రక్రియ ద్వారా పనిచేస్తుంది మరియు దాని కార్యకలాపాలు వాణిజ్యం మరియు పెట్టుబడి, విద్య, ఇంధనం మరియు పర్యావరణంతో సహా అనేక రకాల సమస్యలపై దృష్టి సారించాయి.
Also Read :
- ఆసియాన్ ఒక ముఖ్యమైన ప్రాంతీయ సంస్థగా మారింది, ప్రాంతీయ స్థిరత్వం, ఆర్థిక ఏకీకరణ మరియు వివిధ ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై సహకారాన్ని ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇది చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్, కెనడా మరియు యూరోపియన్ యూనియన్తో సహా దాని సంభాషణ భాగస్వాములతో సన్నిహిత సంబంధాలను కూడా ఏర్పరచుకుంది.
- 2023 ఏసియాన్ సమ్మిట్ ఇండోనేషియాలో జరుగుతుంది.
- 2024 ఏసియాన్ సమ్మిట్ లావోస్లో జరుగుతుంది.
➠ ఆసియాన్ - భారత్ :
- ఏసియాన్ కూటమి, భారతదేశానికి మద్య 1992 లో చర్చాభగస్వాములుగా అంగీకారం కుదిరింది. 1996 నాటికి పూర్తిస్థాయి చర్చల భాగస్వామి అయింది.
- భారతదేశం తొలిసారిగా 1996 లో ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన ఆసియాన్ సమావేశానికి చర్చల భాగస్వామిగా హజరైంది.
- 2002 లో కంబోడియాలో మొట్టమొదటిసారిగా ఆసియాన్ - భారత్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. అప్పటి నుండి అది ప్రతి సంవత్సరం జరుగుతుంది.
- ఆసియాన్ దేశాల వార్షిక సమావేశానంతరం ఆసియాన్ - భారత శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది.
- 18వ ఆసియాన్ - భారత్ శిఖరాగ్ర సదస్సు -2021 బ్రూనై అధ్యక్షతన జరిగింది.
- 2022 నాటికి ఆసియాన్ - భారత్ భాగస్వామ్యానికి 30 సంవత్సరాలు పూర్తి అవుతాయి. అందువల్ల ఆసియాన్-భారత స్నేహ సంవత్సరంగా జరుపుకుందామని భారత ప్రధాన పిలుపునిచ్చారు.
0 Comments