దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న 500 పోస్టుల భర్తీకి ఐడీబీఐ బ్యాంక్ అర్హులైన అభ్యర్థుల నుండి ధరఖాస్తులను స్వీకరిస్తుంది. మణిపాల్ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్ నోయిడా) విద్యా సంస్థలతో కలిసి పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు ద్వారా ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) ఇట్టి పోస్టును భర్తీ చేయనుంది. ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది పీజీ డీబీఎఫ్లో శిక్షణ ఇస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్తో పాటు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం లభిస్తుంది.
➺ మొత్తం పోస్టులు :
- 500
➺ జోన్లు :
- అహ్మదాబాద్
- భోపాల్
- బెంగళూరు
- చెన్నై
- హైదరాబాద్
- ముంబాయి
- నాగ్పూర్
- పుణె
- భువనేశ్వర్
- పాట్నా
- చంఢీగడ్
- ఢిల్లీ
- కోల్కతా
- లక్నో
➺ పోస్టు పేరు :
- జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ -ఓ)
➺ అర్హత :
- ఏదేని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణత
- 31 జనవరి 2024 నాటి 21 నుండి 25 సంవత్సరాలుండాలి (రిజర్వేషన్ వర్తించును)
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్లైన్
Also Read :
➺ ఫీజు :
- రూ॥200/-(ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు)
- రూ॥1000/- (మిగతావారికి)
➺ పరీక్షా కేంద్రాలు :
- హైదరాబాద్
- కరీంనగర్
- ఖమ్మం
- వరంగల్
- విజయవాడ
- విశాఖపట్టణం
- చీరాల
- చిత్తూర్
- ఏలూర్
- గుంటూర్
- కడప
- కాకినాడ
- కర్నూలు
- నెల్లూర్
- ఒంగోలు
- రాజమండ్రి
- శ్రీకాకుళం
- తిరుపతి
- విజయనగరం
➺ పరీక్ష విధానం :
మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. లాజికల్ రిజనింగ్, డేటా అనాలసిస్, ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జవరల్ / ఎకానమి /బ్యాంకింగ్ అవేర్ నెస్ నుండి ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
➺ శిక్షణ ఫీజు వివరాలు :
ఎంపికైన అభ్యర్థులను ఏడాది పాటు పోస్టు గ్రాడ్యువేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సులో శిక్షణ ఇస్తారు. కోర్సు ఫీజు 3 లక్షలు ఉంటుంది. విడతల వారీగా ఫీజు చెల్లించే వెసులుబాటు కూడా ఉంటుంది. అర్హత గల అభ్యర్థులకు ఐడీబీఐ బ్యాంక్ విద్యారుణం సైతం మంజూరు చేస్తుంది. కోర్సులో చేరేటప్పుడు అభ్యర్థులు మూడేళ్లు సర్వీస్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది.
- ఆన్లైన్ ప్రారంభం 12 ఫిబ్రవరి 2024
- ఆన్లైన్ ముగింపు చివరి తేది 26 ఫిభ్రవరి 2024
- పరీక్ష తేది. 17 మార్చి 2024
0 Comments