Telangana History (Writers) Questions in Telugu | History Gk Questions in Telugu with Answers

Telangana History (Writers) Questions in Telugu

తెలంగాణ చరిత్ర (కవులు - సాహిత్యం) జీకే ప్రశ్నలు - జవాబులు

Telangana History (Literature - Writers) Gk Questions in Telugu with Answers


    Gk Questions and Answers in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central Investigation Agencies, UPSC, Civils etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే Gk Questions in Telugu పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

☛ Question No.1
డాక్టర్‌ సింగిరెడ్డి నారాయణ రెడ్డి పద్మభూషణ్‌ అవార్డు ఏ సంవత్సరంలో స్వీకరించారు ?
ఎ) 1998
బి) 1992
సి) 1993
డి) 1991

జవాబు : బి) 1992

☛ Question No.2
ఈ క్రిందివాటిలో డాక్టర్‌ సింగిరెడ్డి నారాయణరెడ్డికి సంబంధించి సరైన  వాటిని గుర్తించండి ?
1) సి.నారాయణరెడ్డి విశ్వంబర, కర్పూర వసంతరాయలు, ముఖాముఖి, కలం సాక్షిగా, భూగోళమంత మనిషి వంటి రచనలు చేశారు.
2) విశ్వంభర కావ్యానికి 1988 సంవత్సరంలో జ్ఞానఫీఠ్‌ అవార్డు లభించింది
3) మంటలూ - మానవుడూ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది
4) ఈయన 29 జూలై 1931 తేదీన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని హన్మాజీపేటలో జన్మించారు.
ఎ) 1, 2 మరియు3 మాత్రమే
బి) 2, 3 మరియు 4 మాత్రమే
సి) 2 మరియు 3 మాత్రమే
డి) 1, 2, 3 మరియు 4

జవాబు : డి) 1, 2, 3 మరియు 4

☛ Question No.3
ఈ క్రిందివాటిలో సామల సదాశివ కవికి సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి ?
1) ఈయన తెలుగువారికి హిందూస్థానీ సంగీతాన్ని పరిచయం చేశారు.
2) ఈయన మే 11, 1928న ఆదిలాబాద్‌ జిల్లా దహేగావ్‌లో జన్మించాడు
3) యాది, మలయ మారుతాలు, సంగీత శిఖరాలు వంటి వ్యాస సంకనాలు చేశారు
ఎ) 1 మరియు 2 మాత్రమే
బి) 1 మరియు 3 మాత్రమే
సి) 2 మరియు 3 మాత్రమే
డి) 1, 2 మరియు 3

జవాబు : డి) 1, 2 మరియు 3

☛ Question No.4
విప్లవకవిగా గుర్తింపు పొందిన అల్లం రాజయ్య రచించిన గ్రంథం ఏవి ?
ఎ) కొమురం భీం (నవల)
బి) గాయపడ్డ ఉదయం
సి) ఎ మరియు బి
డి) రెండూ కావు

జవాబు : సి) ఎ మరియు బి

☛ Question No.5
ఈ క్రిందివారిలో తాత్విక కవులుగా గుర్తింపు సాధించిన వారు ఎవరు ?
1) మందాడి కృష్ణారెడ్డి - బానిస
2) బోయ జంగయ్య - జాతర, సుంకిరెడ్డి
3) నారాయణరెడ్డి - తోవ ఎక్కడ
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 1, 2 మరియు 3
డి) ఏవీకావు

జవాబు : సి) 1, 2 మరియు 3

☛ Question No.6
ఈ క్రిందివారిలో అభ్యుదయ కవులుగా గుర్తింపు సాధించిన వారు ఎవరు ?
1) ఆవుల పిచ్చయ్య - వెట్టిచాకిరి
2) కాంచనపల్లి చిన వెంకటరమణారావు
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2 రెండూ కావు
డి) 1 మరియు 2

జవాబు : డి) 1 మరియు 2

☛ Question No.7
సి.నారాయణరెడ్డి ఏ విశ్వవిద్యాలయానికి వైస్‌ చాన్స్‌లర్‌గా పనిచేశారు ?
ఎ) అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం
బి) ఉస్మానియా విశ్వవిద్యాలయం
సి) కాకతీయ విశ్వవిద్యాలయం
డి) నాగార్జున విశ్వవిద్యాలయం

జవాబు : ఎ) అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం

☛ Question No.8
ఈ క్రిందివాటిలో సామల సదాశివ రచించిన నవలల్లో లేనిది ఏది ?
ఎ) మీర్జాగాలిబ్‌
బి) ఉర్దూ సాహిత్య చరిత్ర
సి) ఉర్దూ కవుల కవితా సామాగ్రి
డి) పైవేవీ కావు

జవాబు : డి) పైవేవీ కావు

☛ Question No.9
ఈ క్రిందివాటిలో దళిత బహుజన కవులు వారు రచించిన నవలలతో జతచేయండి ?
1) పులిపాటి గురుస్వామి
2) గోపగాని రవీందర్‌
3) దొడ్డి రామ్మూర్తి
4) కందుకూరి దుర్గ
ఎ) ఇసుక గొంతులు
బి) అంకురం
సి) బొక్కెన లొల్లి
డి) జీవిగంజి

ఎ) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి

జవాబు : ఎ) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ

☛ Question No.10
ఈ క్రిందివారిలో దిగంబర కవులు కానివారు ఎవరు ?
ఎ) చెరబండ రాజు
బి) నిఖిలేశ్వర్‌
సి) పులిపాటి గురుస్వామి
డి) పేర్వారం జగన్నాథం

జవాబు : సి) పులిపాటి గురుస్వామి




Also Read :


☛ Question No.11
ఈ క్రిందివాటిలో దళిత బహుజన కవులు ఎవరు ?
ఎ) పులిపాటి గురుస్వామి, గోపగాని రవీందర్‌
బి) దొడ్డి రామ్మూర్తి, కందుకూరి దుర్గ
సి) హరగోపాల్‌, ఎం.వెంకట్‌, వేముల మల్లయ్య
డి) పైవన్నీ

జవాబు : డి) పైవన్నీ

☛ Question No.12
ఈ క్రింది రచనల్లో సి.నారాయణరెడ్డి రచన కానిది ఏది ?
ఎ) విశ్వంభర
బి) మంటలూ - మానవుడూ
సి) వృషభ పురాణం
డి) ముఖాముఖి ‌

జవాబు : సి) వృషభ పురాణం

☛ Question No.13
ఈ క్రింది వాటిలో ఏ రచనకు సి.నారాయణ రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ?
ఎ) కలం సాక్షిగా
బి) భూగోళమంత మనిషి
సి) మంటలూ - మానవుడూ
డి) మధ్యతరగతి మందహాసం

జవాబు : సి) మంటలూ - మానవుడూ

☛ Question No.14
ఈ క్రింది వారిలో జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి తెలంగాణ కవిగా గుర్తింపు సాధించిన వారు ఎవరు ?
ఎ) చెరబండ రాజు
బి) పేర్వారం జగన్నాథమ్‌
సి) సి.నారాయణ రెడ్డి
డి) నిఖిలేశ్వర్‌

జవాబు : ఎ) సి నారాయణ రెడ్డి 

☛ Question No.15
సామల సదాశివ అనే కవి తెలుగువారికి పరిచయం చేసిన సంగీతం ఏది ?
ఎ) కర్ణాటక సంగీతం
బి) హిందూస్థానీ సంగీతం
సి) బెంగాలీ సంగీతం
డి) పైవేవీ కావు ‌

జవాబు : బి) హిందూస్థానీ సంగీతం ‌  

☛ Question No.16
గజల్‌ను తెలుగులోకి మొదటిసారిగా ప్రవేశపెట్టినవారు ఎవరు ?
ఎ) చందాల కేశవదాసు
బి) సి.నారాయణరెడ్డి
సి) సామల సదాశివ
డి) గోవిందాచార్యులు

జవాబు : బి) సి.నారాయణరెడ్డి ‌  

☛ Question No.17
సి.నారాయణరెడ్డి ఏ సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు ?
ఎ) తెలుగు అధికార భాషా సంఘం
బి) విశాలాంధ్ర సమైఖ్య సంఘం
సి) సంస్కృత అధికార భాషా సంఘం
డి) పైవేవీ కావు ‌

జవాబు : ఎ) తెలుగు అధికార భాషా సంఘం ‌  

☛ Question No.18
ఈ క్రింది గ్రంథాల్లో వేముల మల్లయ్య రచించిన గ్రంథం ఏది ?
ఎ) కర్పూర వసంతరాయలు
బి) తెలుగు వైభవం
సి) కక్క
డి) ధర్మజ్ఞానం ‌

జవాబు : సి) కక్క‌ ‌  

☛ Question No.19
‘‘యాది’’ గ్రంథ రచయిత ఎవరు ?
ఎ) హరగోపాల్‌
బి) శేషాచార్యులు
సి) పులిపాటి గురుస్వామి
డి) సామల సదాశివ ‌

జవాబు : డి) సామల సదాశివ ‌  

☛ Question No.20
ఈ క్రిందివారిలో ‘మరో భారతం’ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ?
ఎ) మందాడి కృష్ణారెడ్డి
బి) చెరబండ రాజు
సి) ఆవుల పిచ్చయ్య
డి) ఎం.వెంకట్‌ ‌

జవాబు : బి) చెరబండ రాజు ‌  


Also Read :

Post a Comment

0 Comments