
స్వామి దయానంద సరస్వతి Dayananda Saraswati Biography in Telugu | Indian History in Telugu | Gk in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
దయానంద సరస్వతి క్రీ.శ 1824 సంవత్సరంలో గుజరాత్లోని మోర్చి జిల్లాలో ‘టంకార’ ప్రాంతంలోని బ్రహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతని అసలు పేరు మూల శంకర్. ఇతనికి ‘సింధి మరు’ అనే బిరుదు కలదు. భారతదేశాన్ని మతపరంగా, సాంఘికంగా, జాతిపరంగా ఏకం చేయడమే ప్రధాన లక్ష్యంగా ‘‘ఆర్య సమాజాన్ని’’ స్థాపించారు. స్వదేశీ అనే పదాన్ని ఉపయోగించిన మొదటి భారతీయుడు దయానంద సరస్వతి.వేదాలను అధ్యయనం చేసి వాటిని ప్రచారం చేయడానికి జీవితమంతా కృషి చేశాడు. తన యొక్క అభిప్రాయాలను పుస్తక రూపంలో ప్రజలకు అందించడానికి ‘‘సత్యార్థ ప్రకాశిక’’ అనే గ్రంథాన్ని రచించాడు. ఇవే కాకుండా వేద ప్రకాశిక, వేద రహస్య అనే రచనలు చేశాడు. భారత జాతీయత, ఏకేశ్వరోపాసన వంటి భోదనలు చేశాడు. పురాణాలను, హిందూమతాన్ని పక్కదారిపట్టించే పుజారులను విమర్శించాడు.
స్వామి దయానంద సరస్వతి శుద్ది ఉద్యమాన్ని ప్రారంభించాడు. దేశ సమైఖ్యతను సాధించడం మరియు ఇతర మాతాలలోకి మారిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యం. హైదరాబాద్ సంస్థానంలో శుద్ది ఉద్యమంలో ‘పండిట్ నరేంద్రజీ’ పాల్గొన్నారు. కేసరి ‘వైదిక ఆత్మ’ అనే పత్రికను స్థాపించాడు. దయానంద సరస్వతి 30 అక్టోబర్ 1883న రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతంలో మరణించాడు.
Related Posts :
0 Comments