
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
భారత స్వాతంత్ర సంగ్రామంలో అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా పేరు తెచ్చుకుంది జలియన్వాలాబాగ్ దురంతం. ఈ జలియన్వాలాబాగ్ దురంతం ఉత్తర భారతదేశంలోని అమృతసర్ పట్టణంలో 13 ఏప్రిల్ 1919న జరిగింది.
బ్రిటిష్ ప్రభుత్వం 1919లో రౌలత్ చట్టాన్ని అమలు చేసింది. ఈ రౌలత్ చట్టం ప్రకారం వారెంటు లేకుండా ఎవరినైనా, ఎంతకాలమైన నిర్భందించడానికి, ఎవరి ఇళ్లయిన సోదాచేయడానికి, ఆస్తులను జప్తుచేయడానికి, నిందితులను ప్రత్యేక న్యాయాస్థానాలలో విచారించడానికి అధికారం ఉంటుంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా జరిగిందే జలియన్ వాలాబాగ్ హత్యాకాండ.
Also Read :
బ్రిటిష్ ప్రభుతం ప్రవేశపెట్టిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలలో పంజాబ్ నాయకులైన సత్యపాల్, సైపుద్దిన్కిచ్లూలను ఏప్రిల్ 9న అరెస్టు చేశారు. వీరి అరెస్టుకు నిరసనగా ఏప్రిల్ జలియన్వాలాబాగ్లో 13 ఏప్రిల్ 1919 రోజున దాదాపు 20 వేల మంది శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ సమయంలో పంజాబ్ లెప్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్న జనరల్ రెజివాల్డ్ డయ్యర్ గుంపును చెదరగొట్టడానికి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా దాదాపు 10 నిమిషాల పాటు తుపాకి కాల్పులు జరిపాడు. దాని ఫలితంగా వేలమంది మరణించడమే కాకుండా అనేకమంది క్షతగాత్రులయ్యారు. దీనినే జలియన్ వాలాబాగ్ దురంతం లేదా అమృత్సర్ మారణకాండగా పిలుస్తారు.
ఈ నరమేధంతో బ్రిటిష్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ద్వేషభావం ఏర్పడిరది. రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ వారు తనకిచ్చిన నైట్హుడ్ బిరుదును తిరిగి ఇచ్చాడు. గాంధీకూడా కైసర్ - ఎ - హింద్ బిరుదును తిరిగి ఇచ్చేశాడు. జలియన్వాలాబాగ్ హత్యాకాండపై విచారణ జరపడానికి బ్రిటిష్ ప్రభుత్వం హంటర్ కమీషన్ను నియమించింది. దీనిపై నమ్మకం లేని కాంగ్రెస్ ప్రతిగా మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన కమీషన్ను నియమించింది. హంటర్ కమీషన్ 379 మంది మరణించారని నివేదిక ఇవ్వగా, నెహ్రూ కమీషన్ 1200 మంది మరణించారని, 3500 మంది క్షతగాత్రులయ్యారని తెలిపింది. బ్రిటిష్వారీ దమననీతి వల్ల ప్రజల్లో స్వేచ్ఛకాంక్ష పెరిగి స్వాతంత్య్రోద్యమం వైపు మళ్లేలా చేసింది ఈ దుర్ఘటన.
0 Comments