బాలగంగాధర్ తిలక్
Bal Gangadhar Tilak in Telugu | Indian History in Telugu
బాలగంగాధర్ తిలక్ 23 జూలై 1856నలో రత్నగిరికి చెందిన చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాలగంగాధర్ తిలక్ భారత జాతీయోద్యమ పితామహునిగా పేరుగాంచాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాన్య ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను బలోపేతం జాతీయోద్యమంలో పాల్గొనేటట్లు చేశాడు. ఈయన పెర్గుసన్ కాలేజి (పూణే)లో మ్యాథమెటిక్స్ బోధించాడు. అగార్కర్, మహాదేవ్ గోవింద రనడే, దాదాబాయి నౌరోజీలను ఆదర్శంగా తీసుకొని 1889లో జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా చేరాడు. తిలక్ తన యొక్క రాజకీయ గురువుగా ‘రనడే’ ను పేర్కొన్నాడు. ప్రజలలో దేశభక్తి పెంపొందించడం కోసం 1893లో గణపతి ఉత్సవాలు, 1895లో శివాజీ ఉత్సవాలను నిర్వహించాడు. మహారాష్ట్రలో పన్నుల నిరాకరణోద్యమాన్ని నడిపాడు. పూణా కేంద్రంగా బాంబే ప్రెసిడెన్సీలో వందేమాతరం ఉద్యమాన్ని నిర్వహించాడు. ఇతనికి భారతదేశానికి మకుటం లేని రాజు, లోకమాన్య, మరాఠ కేసరి అనే బిరుదులున్నాయి. మరాఠా (ఆంగ్ల పత్రిక), కేసరి (మరాఠ పత్రిక) అనే పత్రికలు స్థాపించి విజయవంతంగా నిర్వహించాడు. 1908లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన పత్రికలలో కథనాలు వ్రాసినందుకు గాను మాండలే (బర్మా)లో 6 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. ఇతను 1916 ఏప్రిల్లో పూణాలో మొదటి హోమ్రూల్లీగ్ను స్థాపించాడు. 1905లో లార్డ్ కర్జన్ వైస్రాయిగా ఉన్నప్పుడు జరిగిన బెంగాల్ విభజనను వ్యతిరేకించాడు. ఇతను గోవధ వ్యతిరేకంగా సంఘాలను ఏర్పాటు చేశాడు. ఈయన 01 అగస్టు 1920న అనారోగ్యంతో మరణించాడు.
వ్యక్తి పేరు | బాలగంగాధర్ తిలక్ |
విశిష్టత | భారత స్వాతంత్ర సమరయోధుడు |
జననం | 23 జూలై 1856 |
రాజకీయ గురువు | రనడే |
బిరుదులు | లోకమాన్య, మరాఠా కేసరి |
పత్రికలు | మరాఠా, కేసరి |
రచనలు | ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్, గీతా రహస్య |
మరణం | 01 అగస్టు 1920 |
0 Comments