
బిపిన్ చంద్రపాల్
Bipin Chandra Pal Biography in Telugu | Indian History in Telugu
బిపిన్ చంద్రపాల్ ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న సిల్హేట్ జిల్లాలోని సియోల్లో 07 నవంబర్ 1858న జన్మించాడు. బంకించంద్ర పాల్ని బెంగాల్ విప్లవ వీరుడు అని, బెంగాల్ డాంటన్ అని వర్ణించాడు. ఇతను రాజకీయ నాయకునిగా, రచయితగా, భారత స్వాతంత్రోద్యమ నాయకునిగా, ఉద్యమకారునిగా, సంఘసంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించాడు. బిపిన్ చంద్రపాల్ యొక్క రాజకీయ గురువు సురేంద్రనాథ్ బెనర్జీ. 1876లో శివనాధ శాస్త్రి ప్రోత్సాహంతో బ్రహ్మ సమాజంలో చేరి దాని సిద్దాంతాలను ప్రచారం చేశాడు. మరియు 1886లో జాతీయ కాంగ్రెస్లో సభ్యునిగా చేరి స్వదేశీ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 1905 బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పనిచేశాడు. లాలలజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్లతో కలిసి బ్రిటీష్ వస్తువులు మరియు దుకాణాలను బహిష్కరించడం, విదేశీ వస్త్రాలకు నిప్పుపెట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించి స్వాతంత్రోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యపాత్ర పోషించారు. అందువల్ల ఈ ముగ్గురిని ‘‘లాల్-బాల్-పాల్’’ త్రయం అని పిలిచేవారు. ఇతను వందేమాతరం ఉద్యమంలో తన ప్రసంగాలతో ప్రజల్లో జాయోద్యమ కాంక్షను నిలిపిపాడు. అరబిందో ఘోష్కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వనందుకు ఇతనని ఆరు నెలల పాటు జైలులో వేశారు.
బిపిన్ చంద్రపాల్ భారత జాతీయవాదం, బ్రహ్మసమాజం-స్వాతంత్రానికి యుద్ధం, ది సోల్ ఆఫ్ ఇండియా, నా జీవిత కాలం నాటి జ్ఞాపకాలు, ది న్యూ ఎకనామిక్ మెనాస్ టు ఇండియా వంటి రచనలు చేశాడు. ఇతను పరిదర్శక్ (బెంగాలి), న్యూ ఇండియా (ఆంగ్లం), హిందూ రివ్యూ (ఆంగ్లం), ది బెంగాలీ పబ్లిక్ ఒపీనియన్, ది ట్రిబ్యూన్, ఇండిపెండెంట్, వందేమాతరం(ఆంగ్లం) వంటి పత్రికలు నడిపాడు. అంతేకాకుండా లండన్లో స్వరాజ్, ఇండియన్ స్టూడెంట్స్ వంటి పత్రికలు నడిపాడు. చంద్రపాల్ 20 మే 1932న మరణించినాడు.
0 Comments