
మదన్మోహన్ మాలవ్య
Madan Mohan Malaviya Biography in Telugu | Indian History in Telugu
మదన్మోహన్ మాలవ్య 25 డిసెంబర్ 1861న అలహాబాద్లో జన్మించాడు. ఇతను భారత స్వాతంత్ర సమరయోధుడు. 1905 జ్ఞాన మహాసభను హరిద్వార్ వద్ద ఏర్పాటు చేశారు. వారణాసిలో అనిబిసెంట్ స్థాపించిన కేంద్ర హిందూ కళాశాలను 1916లో మదన్మోహన్ మాలవ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా స్థాపించాడు.ఈ విశ్వవిద్యాలయం ఆసియాలో అతిపెద్ద రెసిడెన్షియల్ యూనివర్సిటీగా పేరుగాంచింది. మాలవ్య ఈ విశ్వవిద్యాలయానికి 1919 నుండి 1938 వరకు వైస్ చాన్స్లర్గా పనిచేశారు. 1923లో స్వరాజ్య పార్టీలో చేరి 1924 నుండి 1946 వరకు హిందూస్థాన్ టైమ్స్కు చైర్మన్గా ఉన్నాడు. 1930లో జరిగిన మొదటి రౌండ్టేబుల్ సమావేశానికి హజరైన ముఖ్యులలో మాలవ్య ప్రథముడు. 1931 లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి వ్యక్తిగత హోదాలో హాజరైయ్యారు. సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా పనిచేశాడు. 1909 లో జరిగిన లాహోర్ మరియు 1918లో ఢిల్లీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించారు. 1933లో సనాతన ధర్మ అనే పత్రికను ప్రారంభించాడు. 1934లో ఎం.ఎస్ మాధవ శ్రీహరితో కలిసి కాంగ్రెస్ నేషనల్ పార్టీని స్థాపించాడు. ఈ పార్టీ 1934లో కేంద్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 12 సీట్లు గెలుచుకుంది.
ఇతనికి మహామాన, మచ్చలేని పండితుడు అనే బిరుదులున్నాయి. ఇతను ఆల్ ఇండియా సేవా సమితి, హిందూ ధర్మ ప్రవర్థిని సభ, సనాతన ధర్మ మహాసభ, హిందూమహసభ అనే సంస్థలు స్థాపించాడు. ఇతను మోతీలాల్ నెహ్రూ సహాయంతో లీడర్ (ఆంగ్లం), అభ్యుదయ (హిందీ), హిందుస్థాన్ దైనిక్ (హిందీ), మర్యాద అనే పత్రికలు స్థాపించాడు. ఈయన అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2014లో భారతరత్నతో సత్కరించింది. మాలవ్య 12 నవంబర్ 1946న మరణించినారు.
0 Comments