మృత్తికలు
భూమి ఉపరితలంపై కర్బన, అకర్బన పదార్థాలతో నిండి ఉన్న పలుచనైన పొరను ‘మృత్తిక’ అని పిలుస్తారు. మృత్తికలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని పెడాలజీ అంటారు.
భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఎంఆర్) భారతదేశంలో ఉన్న నేలలను 8 రకాలుగా విభజించింది.
1) ఒండ్రుమట్టి నేలలు
2) నల్లరేగడి నేలలు
3) ఎర్ర నేలలు
4) లాటరైట్ నేలలు
5) ఎడారి నేలలు
6) ఆమ్ల, క్షార నేలలు
7) అటవీ నేలలు
8) పీట్ / జీవ సంబంధ నేలలు
భారతదేశంలోని మృత్తికా పరిశోధనా కేంద్రాలు
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ (ఐసీఏఆర్) - భోపాల్, మధ్యప్రదేశ్
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రిసెర్చ్ (ఐఐహెచ్ఆర్) - బెంగళూరు, కర్ణాటక
- సెంట్రల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైలాండ్ అగ్రికల్చర్ (ఐసీఏఆర్) - హైదరాబాద్, తెలంగాణ
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ అండ్ వాటర్ కర్జర్వేషన్ (ఐసీఏఆర్) - డేహ్రాడూన్, ఉత్తరాఖండ్
- సెంట్రల్ సాయిల్ సెలైనిటి రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, కర్నాల్ (ఐసీఏఆర్) - కర్నాల్, హర్యానా
- నేషనల్ బ్యూరో ఆప్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ (ఐసీఏఆర్) - బెంగళూర్, కర్ణాటక
- డి.డబ్ల్యూ.ఆర్ - హిస్సార్, హర్యాణా
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ (ఐసీఎఆర్) ఊటీ, తమిళనాడు
0 Comments