డిప్లొమా ఇన్ రైల్వే ఇంజనీరింగ్
న్యూఢిల్లీ లోని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్మనెంట్ వే ఇంజనీర్స్ (ఇండియా) డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లో అడ్మిషన్ల కొరకు ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది. రెండు సంవత్సరాల కాలపరిమితి కల్గి ఇట్టి కోర్సులో రెండు సెమిస్టర్లు ఉంటాయి.
➺ కోర్సు పేరు :
- డిప్లొమా ఇన్ రైల్వే ఇంజనీరింగ్
➺ అర్హత :
- గుర్తింపు పొందిన కళాశాల నుండి సైన్ / కామర్స్ / ఇంజనీరింగ్ విభాగాల్లో బీఎస్సీ / బీకామ్ / బీఈ ఉత్తీర్ణత సాధించాలి.
- ఏదేని ఇంజనీరింగ్ విభాగంలో 3 సంవత్సరాల డిప్లామా ఉత్తీర్ణత సాధించాలి.
- ఇంటర్ స్థాయిలో మేథమెటిక్స్ / సైన్స్ ఒక సబ్జెక్టుగా చదివి బీఏ పూర్తి చేసిన వారు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు.
➺ ప్రోగ్రామ్ ఫీజు :
- రూ॥4130/- (జీఎస్టీతో) - మొదటి సెమిస్టర్
- రూ॥4720/- (జీఎస్సీతో) - రెండో సెమిస్టర్
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥4330/-
➺ ధరఖాస్తు విధానం :
వెబ్సైట్ నుండి ధరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా నింపి సంబంధిత చిరునామాకు పంపించాలి.
➺ చిరునామా :
ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పర్మనెంట్ వే ఇంజనీర్స్ (ఇండియా), రూమ్ నెం.109, ఎన్సీఆర్పీయూ బిల్డింగ్, శంకర్ మార్కెట్ పక్కన, న్యూడిల్లీ - 110001
ఆన్లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 31 అగస్టు 2024
0 Comments