మోసపూరిత ఫోన్కాల్స్పై ఫిర్యాదు కోసం ‘‘సంచార్ సాథీ’’ యాప్
మోసపూరిత ఫోన్కాల్స్, ఎస్ఎంఎస్లపై సులభంగా ఫిర్యాదు చేసేందుకు టెలికాం విభాగం ‘‘సంచార్ సాథీ’’ అనే యాప్ను విడుదల చేసింది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్లలో పనిచేస్తుంది. వినియోగదారుడు తనకు వచ్చిన ఫోన్కాల్స్, ఎస్ఎంఎస్లు మోసపూరితమైనదని అనిపిస్తే వెంటనే ‘‘సంచార్ సాథీ’’ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారుడు తన ధృవీకరణ పత్రాలతో ఎవరైనా ఫోన్ కనెక్షన్ తీసుకొని ఉండవచ్చని భావిస్తే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా పోగొట్టుకున్న లేదా ఎవరైనా దొంగిలించిన మొబైల్ ఫోన్లను స్తంభింపచేయబడం, కనుగొనే అవకాశం ఈ యాప్లో కల్పించారు.
0 Comments