Prasanta Chandra Mahalanobis
ప్రశాంత చంద్ర మహాలనోబిస్
పూర్తి పేరు: ప్రశాంత చంద్ర మహాలనోబిస్ (Prasanta Chandra Mahalanobis)
జననం: 1893 జూన్ 29, కోల్కతా (కలకత్తా)
➺ విద్య:
- స్కూలింగ్ : బ్రహ్మోబాయ్స్ స్కూల్
- గ్రాడ్యుయేషన్ : కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ప్రెసిడెన్సీ కాలేజ్
- ఉపాధ్యాయులు : జగదీశ్ చంద్రబోస్, ప్రపుల్ల చంద్రరాయ్
- 1912లో భౌతికశాస్త్రంలో B.Sc. డిగ్రీ పొందారు
- భారతదేశంలో గణాంకశాస్త్ర పితామహుడుగా ప్రసిద్ధి.
- 1931 డిసెంబర్ 17న Indian Statistical Institute (ISI)ను స్థాపించారు.
- 1937–1944 మధ్య కాలంలో భారీ సర్వేలు నిర్వహణపై అధ్యయనాలు చేశారు.
- రాండమ్ శాంప్లింగ్ పద్ధతి ద్వారా పంటల విస్తీర్ణం, దిగుబడుల గణాంకాలను విశ్లేషించారు.
- పైలట్ అధ్యయనాల (Pilot Studies) భావనను ప్రవేశపెట్టారు.
➺ మహలనోబిస్ దూరం (Mahalanobis Distance):
- గణాంకాలలో విస్తృతంగా ఉపయోగించే ఒక ముఖ్యమైన గణన పద్ధతిని అభివృద్ధి చేశారు.
➺ జాతీయ శాంపిల్ సర్వేలు (National Sample Surveys):
- ఆయన రూపకల్పన చేసిన ఈ సర్వేలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.
➺ ప్రణాళికా రంగంలో పాత్ర:
- జవహర్లాల్ నెహ్రూ భారత ప్రణాళిక వ్యవస్థ పితామహుడు అయితే,
ఆ ప్రణాళికలకు మార్గదర్శకుడు మహలనోబిస్. - దేశ అభివృద్ధి పారిశ్రామిక పెట్టుబడుల ద్వారానే సాధ్యమని ఆయన నమ్మకం.
➺ ప్రాజెక్టులు:
- హిరాకుడ్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్టులు మహలనోబిస్ సాంఖ్యక పద్ధతుల ఆధారంగా రూపొందించబడ్డాయి.
➺ గౌరవాలు:
- ఆయన జన్మదినమైన జూన్ 29ను భారతదేశంలో ప్రతి సంవత్సరం “జాతీయ గణాంక దినోత్సవం”గా జరుపుకుంటారు.
➺ మరణం:
- 1972 జూన్ 28న కోల్కతాలో మరణించారు.
Also Read :
Also Read :

0 Comments