Acharya C Narayana Reddy Biography in Telugu

Acharya C Narayana Reddy Biography
 ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె) 

ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి (C. Narayana Reddy) ప్రముఖ తెలుగు మహాకవి, గేయ రచయిత, తత్వవేత్త. ప్రేమగా సినారె అని పిలవబడే ఆయన ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన మహానుభావుడు. సినారె గారు 1931 అక్టోబర్ 29న తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల తాలూకా హన్మాజీపేట గ్రామంలో జన్మించారు.తల్లిదండ్రులు – సింగిరెడ్డి బుచ్చమ్మ, మల్లారెడ్డి.

విద్యాభ్యాసం :

సినారె తన ప్రాథమిక, మాధ్యమిక విద్యను సిరిసిల్ల మరియు కరీంనగర్‌లో పూర్తి చేశారు.ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ కళాశాలలో పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి B.A, M.A,1962లో “ఆధునికాంధ్ర కవిత్వం – సంప్రదాయాలు, ప్రయోగాలు” అనే పరిశోధన గ్రంథానికి Ph.D పట్టా పొందారు.ఈ గ్రంథం ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో ప్రమాణిక గ్రంథంగా గుర్తింపు పొందింది.

సినారె సాహిత్య సేవలు : 

సినారెను నాదకవి అని పిలుస్తారు. ఆయన రచనల్లో సంగీతాత్మకత, భావగర్భితత్వం ప్రత్యేక ఆకర్షణ.

ముఖ్య రచనలు

  •  దివ్వెల మువ్వలు
  • నాగార్జున సాగరం
  • కర్పూర వసంతరాయలు
  • నవ్వని నవ్వు
  • రామప్ప విశ్వదీపం
  • విశ్వంభర
  • మట్టిమనిషీ ఆకాశం
  • తెలుగు గజళ్లు
  • ప్రపంచ పదులు

మట్టిమనిషీ ఆకాశం కావ్యం హిందీ, ఆంగ్ల భాషల్లోకి అనువదించబడింది.సినారె వందలాది గేయాలు, ద్విపదలు, గజళ్లు, వచన కవితలు రచించారు. అనేక తెలుగు సినిమాలకు పాటలు కూడా రాశారు.సినారె కవిత్వం ఒక నిరంతర విశ్వయాత్ర.
మానవ జీవితం, ప్రకృతి, విశ్వ సంబంధాలను తన రచనల ద్వారా వివరించారు.“విశ్వంభర” కావ్యం ఆయనను ఆధునిక భారతీయ మహాకవిగా నిలబెట్టింది.

పురస్కారాలు : 

  • జ్ఞానపీఠ్ అవార్డు – 1988

  • పద్మభూషణ్ అవార్డు – భారత ప్రభుత్వం

  • రాజ్యసభ సభ్యుడు

  • తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు

  • ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు

తెలుగు సాహిత్యంలో జ్ఞానపీఠ్ పొందిన మూడుగురు కవుల్లో సినారె ఒకరు.1990–91లో యుగోస్లోవియాలో జరిగిన ప్రపంచ కవి సమ్మేళనంలో భారతదేశ ప్రతినిధిగా సినారె పాల్గొన్నారు.40 దేశాల కవులతో ఆయన తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.

Post a Comment

0 Comments