కాకతీయుల సామంతులు – కాయస్థ వంశం చరిత్ర | Telangana History in Telugu

telangana history

Kakatiy Dynasty in Telugu | Telangana History in Telugu 

కాకతీయుల సామంతులు – కాయస్థ వంశం చరిత్ర

తెలంగాణ చరిత్రలో కాకతీయ సామ్రాజ్యానికి విశ్వాసపాత్రులుగా పనిచేసిన సామంతుల్లో కాయస్థ వంశం ముఖ్యమైన స్థానం పొందింది. ఈ వంశస్థులు మహారాష్ట్ర ప్రాంతం నుండి వచ్చి తెలంగాణలో స్థిరపడి కాకతీయ చక్రవర్తులకు అండగా నిలిచారు.

గంగయ సాహిణి కాయస్థ వంశానికి ఆద్యుడిగా ప్రసిద్ధి. ఇతడు కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడికి సామంతుడిగా, ఆప్తుడిగా మరియు అశ్వసైన్యాధిపతిగా సేవలందించాడు.

ఇతడి పరిపాలనలో ఉన్న రాజ్యం విస్తృతంగా ఉండేది. ఇందులో –

  • మార్జవాడి
  • పలనాడు
  • కడప
  • నల్లగొండ జిల్లాలోని పానగల్లు

ప్రాంతాలు ముఖ్యమైనవి. ఇతడి రాజధాని కడప జిల్లా వల్లూరు.

దేవగిరి యాదవులపై విజయం

దేవగిరి యాదవ రాజు ఆజ్ఞతో అతడి సామంతుడైన దామోదరుడు కాకతీయ భూభాగాలను ఆక్రమించాడు. గణపతిదేవుడి ఆజ్ఞ మేరకు గంగయ సాహిణి దామోదరుణ్ని ఓడించి కాకతీయ భూభాగాలను రక్షించాడు.ఈ విజయానికి గుర్తింపుగా గణపతిదేవుడు గంగయ సాహిణికి మహామండలేశ్వర బిరుదును ప్రదానం చేశాడు.

జన్నిగదేవుడు మరియు త్రిపురాంతకుడు : 

గంగయ సాహిణి అనంతరం ఇతడి మేనల్లుడు జన్నిగదేవుడు గణపతిదేవుడు మరియు రుద్రమదేవి కాలంలో సామంతుడిగా సేవలందించాడు. ఇతడి రాజ్యంలో నల్లగొండ ప్రాంతం ముఖ్యభాగంగా ఉండేది.జన్నిగదేవుడి సోదరుడు త్రిపురాంతకుడు కూడా కాకతీయుల తరఫున సామంతుడిగా పనిచేశాడు.

అంబదేవుడి తిరుగుబాటు :

తర్వాత జన్నిగదేవుడి సోదరుడు అంబదేవుడు స్వతంత్రంగా రాజ్యం స్థాపించి కాకతీయులకు శత్రువయ్యాడు. ఇతడి రాజ్యంలో నల్లగొండ జిల్లాలోని కృష్ణా నది ఉత్తర ప్రాంతాలు దోర్నాల ప్రాంతం ఉండేవి.అయితే, ఇతడి కుమారుడైన రెండవ త్రిపురాంతకుడి పాలన కాలంలో ఈ రాజ్యం పూర్తిగా కాకతీయ సామ్రాజ్యంలో విలీనమైంది.

ప్రాముఖ్యత :

కాయస్థ వంశస్థులు కాకతీయ రాజ్యానికి సైనిక, పరిపాలనా రంగాలలో విశేష సేవలందించి తెలంగాణ చరిత్రలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు. ముఖ్యంగా గంగయ సాహిణి వంటి వీరులు కాకతీయుల భూభాగాలను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించారు.

Post a Comment

0 Comments