Indian History : Mughal Administration System in Telugu | మొఘలుల పరిపాలన విధానం

మొగల్‌ సామ్రాజ్యం

Mughal Empire Administration in Telugu | Indian History in Telugu   

బాబర్‌ అనే రాజు 1526 సంవత్సరంలో భారతదేశంపై దాడి చేయడంతో మొగలుల పేరుతో ఒక కొత్త వంశం అవతరించింది. మొగల్‌ సామ్రాజ్యాన్ని 1550 నుండి 1707 సంవత్సరాల వరకు భారతదేశమంతా తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. మొగలులు అవలంభించిన విధానాలు, పరిపాలన ఏర్పాట్లు, వాస్తుకళలు వంటి వారి తదనంతరం కూడా వివిధ రాజులను ప్రభావితం చేశాయి. ప్రతి సంవత్సరం భారత ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగించే ‘‘ఎర్రకోట’’ మొగలుల యొక్క నివాసమే.

మొఘలుల పరిపాలన విధానం

మొఘలులు రాజ్యాధికారం చేపట్టకముందు భారతదేశమంతటా అనేక చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. ఈ చిన్న రాజ్యాలను మొగలులు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేశారు. పాత రాజులను, పూర్వ రాజ్యాల పరిపాలన కొనసాగించేందుకు అనుమతించారు. వీరి ద్వారానే రెవెన్యూ శిస్తు వసూలు చేయించేవారు. సామ్రాజ్యంలోని రాజ్యాల మధ్య యుద్దాల నివారణకు చక్రవర్తి ఎప్పుడు తన సైన్యంతో సిద్దంగా ఉండేవాడు. మొగలుల అధికారాన్ని అంగీకరించని రాజులపై నిరంతరం యుద్దాలు చేయడం ద్వారా వారిని అదుపులో ఉంచుకునేవారు. మొగలులు బలపడిన తర్వాత చాలామంది ఇతర రాజులు కూడా తమ సార్వభౌమత్వాన్ని వదిలి మొగలులతో సత్సంబందాలు ఏర్పరచుకున్నారు. కొందరు రాజపుత్రులు మొగలులతో వివాహా సంబంధాలు ఏర్పరచుకున్నారు. చిత్తోడ్‌కు చెందిన సిసోడియా రాజపుత్రులు చాలాకాలం పాటు మొగలుల అధికారాన్ని గుర్తించలేదు. మొగలుల చేతితో ఓడిన రాజులను కూడా గౌరవించి  వారి భూభాగాల్ని మొగలులు తిరిగి అప్పగించేవారు. మొగలుల ముఖ్య ఉద్దేశ్యం ఓడించడమే కాని శత్రువులను అవమానించడం కాదు అనే సిద్దాంతం పాటించేవారు. రాజకీయ వ్యూహంలో భాగంగా మొగలుల స్థానిక రాజకుమార్తెలను వివాహమాడారు. జహంగీర్‌ తల్లి రాజుపుత్ర రాజైన అంబర్‌ (నేటి రాజస్థాన్‌) కాకుమార్తె. షాజహాన్‌ తల్లి రాజుపుత్రులైన జోథ్‌పూర్‌ యువరాణిగా ఉండేది. 

మొగలులు తమ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం పలు ప్రాంతాల నుండి ప్రజలను వివిధ ఉద్యోగాలలో నియమించారు. వీరిలో తురుష్కులు, ఇరానియన్‌లు , భారత ముస్లీంలు, అప్ఘన్లు, రాజపుత్రులు, మరాఠాలు, ఇతరులు ఉన్నారు. వీరందరికి ఉద్యోగాలను కల్పించి మన్సబ్‌దార్లుగా భర్తీ చేసుకోని సైనిక హోదా కల్పించారు. వీరంతా చక్రవర్తి ఆదీనంలో పనిచేసేవారు. మన్సబ్‌దారులు రాజు యొక్క భవంతిని, నిర్ధేశించిన ప్రాంతాన్ని పరిపాలించే విధంగా బాద్యతలు అప్పగించేవారు. కొత్త రాజ్యాలపై దండయాత్రలు, తిరుగుబాట్లను అణచివేసే బాద్యతలను అప్పగించేవారు. ఈ మన్సబ్‌దారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా రాజు యొక్క నిర్ణయాల మేరకు పనిచేసేవారు. 

ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకొకసారి మన్సబ్‌దారులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బదిలీ చేసేవారు. దీంతో బలపడే అవకాశం లేకుండా చేసేవారు. మన్సబ్‌దారు నిర్ణీత సంఖ్యలో గుర్రపు రైతులను, అశ్వికదళాన్ని పెంచి పోషించే బాద్యతను కల్గి ఉండేవాడు. ప్రతి మన్సబ్‌దారు తన అశ్వికదళాన్ని సమీక్షించడానికి తీసుకువచ్చి వాటిని నమోదు చేయించి గుర్రాలకు ముద్రలను వేయించి జీతభత్యాలను పొందేవారు. 

ఒక మన్సబ్‌దారు కుమారుడు మన్సబ్‌దారు కాకుండా చర్యలు చేపట్టేవారు. మన్సబ్‌దారు మరణాంతరం అతని యొక్క యావత్‌ ఆస్తిని కూడా రాజు స్వాధీనం చేసుకునేవాడు. జాగీర్ల నుండి వచ్చే ఆదాయాల నుండి మన్సబ్‌దారులు వారీ జీతాలను తీసుకునేవారు. 

Post a Comment

0 Comments