Alluri Sitarama Raju Gk Questions in Telugu || అల్లూరి సీతరామరాజు జీకే ప్రశ్నలు - జవాబులు

అల్లూరి సీతరామరాజు జీకే ప్రశ్నలు - జవాబులు

అల్లూరి సీతరామరాజు జీకే ప్రశ్నలు - జవాబులు

Alluri Sitarama Raju Gk Questions in Telugu

    Gk Questions and Answers ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

 Question No.1
భారతదేశ చరిత్రలో అల్లూరి సీతరామరాజు పాత్ర ఏమిటీ ?
ఎ) స్వాతంత్ర సమరయోధుడు
బి) శాస్త్రవేత్త
సి) కళాకారుడు
డి) వ్యాపారవేత్త

జవాబు : ఎ) స్వాతంత్ర సమరయోధుడు

 Question No.2
అల్లూరి సీతరామరాజు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జన్మించారు ?
ఎ) మహారాష్ట్ర
బి) ఆంధ్రప్రదేశ్‌
సి) తమిళనాడు
డి) కర్ణాటక ‌

జవాబు : బి) ఆంధ్రప్రదేశ్

 Question No.3
అల్లూరి సీతరామరాజు ఏ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు ?
ఎ) సహాయ నిరాకరణ ఉద్యమం
బి) శాసనోల్లంఘన ఉద్యమం
సి) క్విట్‌ ఇండియా ఉద్యమం
డి) స్వదేశీ ఉద్యమం

జవాబు : డి) స్వదేశీ ఉద్యమం

 Question No.4
అల్లూరి సీతరామరాజును బ్రిటీషు వారు ఏ పేరుతో పిలిచేవారు ?
ఎ) ఉక్కు మనిషి
బి) ఆంధ్రటైగర్‌
సి) ఎదురులేని మనిషి
డి) భారత సింహా ‌

జవాబు : బి) ఆంధ్రటైగర్

 Question No.5
అల్లూరి సీతరామరాజు ఏ చారిత్రాత్మక ఘట్టంలో నాయకత్వానికి ప్రసిద్ది చెందాడు ?
ఎ) జలియన్‌ వాలాబాగ్‌ ఊచకోత
బి) చౌరీచౌరా సంఘటన
సి) మోప్లా తిరుగుబాటు
డి) రాంపా తిరుగుబాటు

జవాబు : డి) రాంపా తిరుగుబాటు

Also Read :

 Question No.6
స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతరామరాజు అహింసపై ఎలాంటి వైఖరి అనుసరించాడు ?
ఎ) బలమైన మద్దతుదారు
బి) మితమైన మద్దతుదారు
సి) ప్రత్యర్థి
డి) తటస్థ

జవాబు :ఎ) బలమైన మద్దతుదారు

 Question No.7
అల్లూరి సీతరామరాజు నేతృత్వంలో రంపా తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది ?
ఎ) 1919
బి) 1922
సి) 1924
డి) 1930

జవాబు : సి) 1924

 Question No.8
రంపా తిరుగుబాటుకు ప్రధాన కారణం ఏమిటీ ?
ఎ) ఆర్థిక దోపిడీ
బి) మత ఘర్షణలు
సి) కులవివక్ష
డి) అధిక పన్ను వసూళ్లు ‌

జవాబు : ఎ) ఆర్థిక దోపిడీ

 Question No.9
అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర పోరాటంలో ఏ రాజకీయ పార్టీతో సంబంధం కల్గి ఉన్నాడు ?
ఎ) భారత జాతీయ కాంగ్రెస్‌
బి) ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాగ్‌
సి) రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ
డి) ఏవీకావు

జవాబు : డి) ఏవీకావు

 Question No.10
అల్లూరి సీతరామరాజు ఎలా మరణించాడు ?
ఎ) బ్రిటీషు వారిచే ఉరితియబడ్డాడు
బి) జైలులో మరణించాడు
సి) బ్రిటిషు వారు కాల్చి చంపారు
డి) సహజ మరణం

జవాబు : సి) బ్రిటిషు వారు కాల్చి చంపారు


 అల్లూరి సీతారామరాజు 

అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, విశాఖపట్టణం జిల్లా, పండ్రంగి గ్రామంలో 04 జూలై 1897 రోజున వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించాడు. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రామరాజు తండ్రి ఫోటోగ్రాఫర్‌గా పనిచేసేవాడు. సీతారామరాజు పాఠశాలలో చదువుతున్న సమయంలోనే తండ్రి మరణించడంతో మేనమామ రామచంద్రరాజు దగ్గర పెరిగాడు. 

1882 సంవత్సరంలో మద్రాసు అటవీ చట్టం అమలు చేయడంతో ఆ చట్టం గిరిజనులను అడవులలో స్వేచ్ఛగా తిరగటాన్ని నిషేదించింది. అటవీ గిరిజన ప్రజలు సాంప్రదాయంగా పోడు వ్యవసాయం చేసుకుంటూ, అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకొని జీవించే గిరిజనులపై  బ్రిటీషువారు ఘోరమైన దురాగతాలు చేయడంతో గిరిజనులు దుర్భర జీవితం గడపాల్సి వచ్చింది. తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో సీతారామరాజు గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. బెంగాలీ విప్లవకారుల దేశభక్తితో సూర్తిపొంది చింతపల్లి, రంపచోడవరం, దమ్మనపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, నర్సిపట్నం, అన్నవరం వంటి ప్రాంతాలలో పోలీసుస్టేషన్లపై సీతారామరాజు దాడులు చేసి అనుచరులకు కావాల్సిన తుపాకులు, మందుగుండు సామాగ్రిని సమకూర్చుకునేవాడు. దమ్మనపల్లి ఘాట్‌ వద్ద స్కాట్‌ కవార్డ్‌తో సహ అనేక  బ్రిటిషు సైనికులను తిరుగుబాటుదారులు చంపేశారు.

    1922 లో సాండర్స్‌ నాయకత్వంలో అస్సారైఫిల్స్‌ కంపెనీని బ్రిటిషు ప్రభుత్వం పంపించింది. వీళ్లు పెగడపల్లి వద్ద మకాం వేశారు. అసమయానికి రహస్య జీవితం గడుపుతున్న సీతారామరాజు నాలుగు నెలల తర్వాత మళ్లీ వెలుగులోకి వచ్చాడు. మల్లుదొర, గంటం దొర వంటి గిరిజనుల నాయకత్వంలో గిరిజన దళాలను ఏర్పరచి విల్లు, బాణాలతో పోరాటాన్ని కొనసాగించాడు. 

గిరిజనుల హక్కుల కొరకు బ్రిటిషు ప్రభుత్వంపై సీతారామరాజు చేస్తున్న తిరుగుబాటు చర్యలను అణగదొక్కడానికి సీతారామరాజును వెతకడం ప్రారంభించింది. చివరకు మంప గ్రామం, కొయ్యురు వద్ద  తేది.07-05-1924 రోజున బ్రిటిషు సైన్యం చుట్టుముట్టి తుపాకులతో కాల్చి చంపారు.  కృష్ణదేవిపేటలో సీతారామరాజు సమాధి ఉంది. 

అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి. నిరుపేదలు, నిరక్షరాస్యులు, అమాయకులు అయిన అనుచరులతో చాలా తక్కువ యుద్ద పరికరాలతో బిట్రీషు సామ్రాజ్యాన్యాన్ని ఢీకొట్టి ముచ్చెమటలు పట్టించి వీరమరణం పొందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు.



Post a Comment

0 Comments