
గుప్త సామ్రాజ్య రాజులు
Gupta Empire Kings | Indian History in Telugu | History in Telugu
భారతదేశ చరిత్రలో గుప్తులు పరిపాలించిన కాలాన్ని ఒక స్వర్ణయుగంగా అభివర్ణిస్తారు. వీరు వైశ్య వర్ణానికి చెందినవారు. గుప్తులు భారతదేశాన్ని క్రీ.శ.280 నుండి క్రీ.శ 550 సంవత్సరాల వరకు పరిపాలించారు. వీరు ఉజ్జయినీ, పాటలీపుత్రాలను రాజధానులుగా చేసుకొని భారతదేశాన్ని పరిపాలించారు. గుప్త రాజులలో మొట్టమొదటి రాజు శ్రీగుప్తుడు. శ్రీగుప్తున్ని గుప్త రాజ్య మూలపురుషునిగా పేర్కొంటారు. గుప్త రాజ్యాన్ని స్థాపించింది మొదటి చంద్రగుప్తుడు. ‘గరుడ' రాజ్య చిహ్నంగా ఉండేది. వీరి అధికార లాంఛనం వారాహం. అధికార, రాజ భాషలు సంస్కృతం.
గుప్త రాజుల వంశం పుట్టుపూర్వోత్తారాల గురించి చరిత్రలో భిన్నాభిప్రాయాలున్నాయి. రొమిల్లా థాపర్ ప్రకారం వీరు సంపన్న భూస్వామి వంశానికి చెందినవారని, కె.పి జైస్వాల్ ప్రకారం పంజాబి జాట్ కులమని, హెచ్.పి రాయచైదరి ప్రకారం బ్రహ్మణులను, అగ్ని మిత్రసురుడి సంతతి అని, యస్.చటోపాధ్యాయ ప్రకారం క్షత్రియులని పేర్కొన్నారు.
➺ గుప్త సామ్రాజ్య రాజులు :
- శ్రీగుప్తుడు
- ఘటోత్కచుడు
- 1వ చంద్రగుప్తుడు
- సముద్రగుప్తుడు
- రామగుప్తుడు
- 2వ చంద్రగుప్తుడు
- కుమార గుప్తుడు
- స్కంద గుప్తుడు
- విష్ణుగుప్తుడు
0 Comments