
ఆధునిక భారతదేశ చరిత్ర (జాతీయోద్యమం - మలి దశ) జీకే ప్రశ్నలు - జవాబులు పార్ట్ - 3
Modern Indian History Questions in Telugu with Answers పార్ట్ - 3
☛ Question No.1
శాసన ఉల్లంఘన ఉద్యమం జరిగే సమయంలో నిర్వహించిన కార్యక్రమాలను గుర్తించండి ?
ఎ) మద్యం దుకాణాల వద్ద పికెటింగ్
బి) విదేశీ వస్త్ర బహిష్కరణ
సి) ఉప్పు చట్టాలను వ్యతిరేకించే చర్యలు
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
☛ Question No.2
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నిర్వహించిన ఏ సమావేశంలో ‘సంపూర్ణ స్వరాజ్ తన లక్ష్యమని’ ప్రకటించింది ?
ఎ) బెల్గాం సదస్సు
బి) కాకినాడ సదస్సు
సి) కరాచీ సదస్సు
డి) లాహోర్ సదస్సు
జవాబు : డి) లాహోర్ సదస్సు
☛ Question No.3
బ్రిటీషు వారు విధించిన ఉప్పు చట్టాలను గాంధీజి వ్యతిరేకించిన రోజ ఏది ?
ఎ) 08 ఏప్రిల్ 1940
బి) 06 ఏప్రిల్ 1930
సి) 05 మార్చి 1925
డి) 05 మార్చి 1932
జవాబు : బి) 06 ఏప్రిల్ 1930
☛ Question No.4
ఏ ఉద్యమ సమయంలో ‘డూ ఆర్ డై ’ అనే నినాధాన్ని గాంధీజి ఉపయోగించాడు ?
ఎ) చంపారన్ ఉద్యమం
బి) సహాయ నిరాకరణ ఉద్యమం
సి) క్విట్ ఇండియా ఉద్యమం
డి) శాసనోల్లంఘన ఉద్యమం
జవాబు : సి) క్విట్ ఇండియా ఉద్యమం
☛ Question No.5
ఈ క్రిందివానిలో క్విట్ ఇండియాలో సమయంలో జరిగిన సంఘటనల్లో లేనిదాన్ని గుర్తించండి ?
ఎ) చరఖాను జాతీయ ఉద్యమ చిహ్నంగా ప్రకటించారు
బి) ప్రజలు సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు.
సి) పోలీస్స్టేషన్లు, పోస్టాఫీసులు ధ్వంసమయ్యాయి.
డి) కాంగ్రెస్ నాయకులు అరెస్టయ్యారు
జవాబు : ఎ) చరఖాను జాతీయ ఉద్యమ చిహ్నంగా ప్రకటించారు
☛ Question No.6
1937లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది ?
ఎ) హిందూ మహాసభ
బి) కమ్యూనిస్టు పార్టీ
సి) భారత జాతీయ కాంగ్రెస్
డి) ముస్లీం లీగ్
జవాబు : సి) భారత జాతీయ కాంగ్రెస్
☛ Question No.7
1942లో క్రిప్స్ కమీషన్ భారతదేశానికి రావడానికి గల ప్రధాన కారణం ఏమిటీ ?
ఎ) భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించడానికి
బి) రెండో ప్రపంచ యుద్దంలో భారతీయుల సహకారం కోసం
సి) జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం
డి) కాంగ్రెస్, ముస్లీంలీగ్ మధ్య వివాదం పరిష్కరించడానికి
జవాబు : బి) రెండో ప్రపంచ యుద్దంలో భారతీయుల సహకారం కోసం
Also Read :
☛ Question No.8
క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో క్విట్ ఇండియా ఉద్యమ కథానాయక అని ఎవరిని పిలిచారు ?
ఎ) అరుణా అసఫ్ అలీ
బి) అనిబిసెంట్
సి) కాదంబిని గంగూలీ
డి) సరోజీని నాయుడు
జవాబు : ఎ) అరుణా అసఫ్ అలీ
☛ Question No.9
భారత స్వాతంత్ర పోరాటంలో చివరి పోరాటంగా దేనిని సూచిస్తారు ?
ఎ) రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు
బి) కోహిమ యుద్దం
సి) శాసన ఉల్లంఘన యుద్దం
డి) క్విట్ ఇండియా యుద్దం
జవాబు : ఎ) రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు
☛ Question No.10
ఈ క్రింద తెలిపిన చారిత్రాత్మక సంఘటనలను వరుస క్రమంలో అమర్చండి ?
1) క్రిప్స్ కమీషన్
2) కేబినెట్ మిషన్ ప్లాన్
3) క్విట్ ఇండియా ఉద్యమం
4) రౌండ్ టేబుల్ సమావేశం
ఎ) 1, 2, 3, 4
బి) 2, 4, 3, 1
సి) 1, 3, 2, 4
డి) 4, 1, 3, 2
జవాబు : డి) 4, 1, 3, 2
☛ Question No.11
ఈ క్రింద తెలిపిన వాటిలో సరికాని దాన్ని గుర్తించండి ?
ఎ) క్విట్ ఇండియా ఉద్యమ సయమంలో గాంధీజిని అరెస్టు చేశారు.
బి) గాంధీజీ ఉప్పు చట్టాలను సబర్మతి వద్ద ఉల్లంఘించారు
సి) శాసనోల్లంఘన ఉద్యమంలో మహిళలు పాల్గొన్నారు.
డి) క్విట్ ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ పాల్గొంది
జవాబు : బి) గాంధీజీ ఉప్పు చట్టాలను సబర్మతి వద్ద ఉల్లంఘించారు
☛ Question No.12
ఈ క్రింది ఏ జాతీయ నాయకుడు భారత స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా జపాన్ సహాయం కోరాడు ?
ఎ) బాలగంగాధర తిలక్
బి) జవహర్లాల్ నెహ్రూ
సి) సుభాష్ చంద్రబోస్
డి) మహాత్మగాంధీ
జవాబు : సి) సుభాష్ చంద్రబోస్
☛ Question No.13
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో బ్రిటిష్ వైస్రాయ్గా ఎవరు పనిచేశారు ?
ఎ) లార్డ్మింటో
బి) వెల్లింగ్టన్
సి) వెవేల్
డి) మౌంట్ బాటన్
జవాబు : డి) మౌంట్ బాటన్
☛ Question No.14
భారతదేశంలో సంస్థానాల విలీన బాద్యతను ఎవరు తీసుకున్నారు ?
ఎ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
బి) మౌలానా అబ్దుల్ కలాం అజాద్
సి) సర్దార్ వల్లభాయిపటేల్
డి) జవహర్ లాల్ నెహ్రూ
జవాబు :సి) సర్దార్ వల్లభాయిపటేల్
☛ Question No.15
స్వాతంత్ర సమాయానికి భారతదేశంలో విలీనం కాకుండా ఉన్న సంస్థానాలేవి ?
ఎ) హైదరాబాద్
బి) జునాఘడ్
సి) కాశ్మీర్
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
☛ Question No.15
ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశానికి గాంధీజి అధ్యక్షత వహించాడు ?
ఎ) కలకత్తా సమావేశం
బి) బెల్గాం సమావేశం
సి) కరాచీ సమావేశం
డి) లాహోర్ సమావేశం
జవాబు : బి) బెల్గాం సమావేశం
Also Read
Modern Indian History (National Movement) Questions in Telugu Part - 1Modern Indian History (National Movement) Questions in Telugu Part - 2
0 Comments